ఆరోగ్య చిట్కాలు
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి అక్కడ ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి.
ఆరు వంతుల నారింజ రసానికి, ఒక వంతు కారెట్ రసం, ఒక వంతు నిమ్మరసం చేర్చి, ఆ మిశ్రమాన్ని రోజుకి మూడు సార్లు సగం కప్ప త్రాగితే నరాల బలహీనత తగ్గుతుంది.
పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుసు ఉంటారు. సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్లో ఉంచి వాటిని పిలలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇసుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది.
ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గుతుంది.
కారట్ రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి భోజనానికి ముందు ఒక కపు తాగితే ముక్కు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చను.
కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతంలో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి.
బచ్చలి రసం, అనాసరసం సమపాళ్లలో తీసుకుని కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
బచ్చలి, కారట్ రసాలు సమపాళ్లలో కలిపి రోజుకు మూడు సార్లు సగం కప్ప చొప్పున తాగితే రోజంతా శక్తి, ఉత్సాహంతో ఉంటారు.
తేనెటీగ, కందిరీగ కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.
అరికాళ్లు విపరీతంగా మంటపుడుతుంటే గోరింటాకు గానీ, నెయ్యి గాని, సొరకాయ గుజ్జుగానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసంలో ఒక చెమ్చా తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతు నొప్పి,దగ్గు వెంటనే తగ్గుతాయి.
పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరిస్తే కొంత పంటినొప్పి తగ్గుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments