చర్మం మెరుస్తూ నిగనిగలాడటానికి చిట్కాలు తీసుకుంటే సరిపోతుంది
ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది. అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం,వంటివి జరగవచ్చు.ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ఆహర పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు -
»
బొప్పాయి,అరటి,జామ,ఆపిల్ వంటిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
»
ఎక్కువ సార్లు మంచీనిరు తాగడం అలవాటు చేసుకోవాలి.
»
నిమ్మ,ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
»
ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
»
తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
»
నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు.
»
టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం,చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
»
రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
»
ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.
»
కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.
»
కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్దనా చేసుకొవాలి.